Monday, October 7, 2024

TG | బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు..

ప్రభన్యూస్ : యాదగిరిగుట్టపై ఈరోజు (గురువారం) ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గొంగిడి సునీత ఆలేరు మాజీ ఎమ్మెల్యే తో కలిసి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయితే, రాజకీయ పరమైన ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధం లేని అర్చకులు ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఆలయ వీధుల్లో పూజలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించారని… యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, పూజారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ సీఐ సతీష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement