Friday, September 20, 2024

TG: కారు – వ్యాన్ ఢీ.. ముగ్గురి దుర్మ‌ర‌ణం…

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ : మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన కారు.. దాని కిందికి చొచ్చుకుని వెళ్లింది. ప్రమాదంలో కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జవ్వగా.. అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వారంతా తిరుపతి నుంచి కర్నూల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా.. మధ్యలో బైక్ ను తప్పించబోయి డీసీఎంను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement