Thursday, September 5, 2024

TG: చెట్టును ఢీకొన్న కారు : బాలుడు మృతి

జన్నారం, జులై 13(ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తొమ్మిది గుడిసెలపల్లి వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం అర్థరాత్రి కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో బాలుడు చనిపోగా, నార్నూర్ సీఐ గన్ మెన్ గోపిచందు, భార్య, తల్లికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాల పాలైన ముగ్గురిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం కొత్తపల్లి (చిక్కులగూడెం)కి చెందిన జాదవ్ గోపీచంద్ నార్నూర్ సిఐ గన్ మెన్ గా పనిచేస్తున్నారు. భార్య గీత, తల్లి జీజాబాయి, కుమారుడు జైసన్ రాజ్ తో కలిసి మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఓ పుట్టినరోజు ఫంక్షన్ కు శుక్రవారం ఉదయం వెళ్లి రాత్రి తన కారులో తిరిగి వస్తుండగా, తొమ్మిదిగుడిసెలపల్లి వద్ద కారు చెట్టుని ఢీకొంది. దీంతో కారులో ఉన్న కుమారుడు జైసన్ రాజ్ (10) అక్కడికక్కడే మృతిచెందగా, గోపీచంద్ కు, భార్య గీతకు, తల్లి జీజాబాయికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ ఫైలెట్ రఫీక్, ఈఎంటి జాడి రమేష్ రాత్రి హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. తీవ్రగాయాల పాలైన గోపీచంద్ తో పాటు భార్య, తల్లిని చికిత్స కోసం హైదరాబాద్ కు ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం తెలిపారు. గోపీచంద్ బావ గుడి పేట బెటాలియన్ టిజిఎస్పి అసిస్టెంట్ కమాండెంట్ (డిఎస్పి) రఘునాథ్ చౌవాన్ దగ్గర ఉండి, తీవ్రగాయాల గురైన ముగ్గురిని హైదరాబాద్ కు తరలించారు. ఆ తర్వాత డి.ఎస్.పి బాలుని దగ్గర ఉండి మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement