Thursday, September 5, 2024

Hyderabad: శామీర్పేట్‌లో కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వ‌చ్చి అదుపుతప్పి డివైడర్ అవతల పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

మజీద్ పురా చౌరస్తాలో కారు అతివేగంగా దూసుకొచ్చి పల్టీకొట్టింది. పక్కనే రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో ఇన్నోవా కారులోని ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై నుంచి బస్సు, ఇన్నోవాకారును పక్కకు తొలగించారు. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు బస్సును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement