Friday, October 18, 2024

TG| ఖమ్మంలో కారు బీభత్సం.. ఒకరు మృతి

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచలో కారు బీభత్సం సృష్టించింది. ఇవాళ‌ ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి కారు వేగంగా దూసుకెళ్లి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఖమ్మం తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. చికిత్స పొందుతూ మంచాల నర్సయ్య అనే వృద్ధుడు మృతిచెందాడు.

అతివేగంతో దూసుకొచ్చిన కారు.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఏడుగురిని ఢీకొట్టింది. అనంతరం ఓ చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement