Saturday, September 7, 2024

Burgampadu – ఆ గ్రామంలో రోగం వస్తే అంతే సంగతులు

కావడిలో ప్రయాణం నరకయాతనే…

బూర్గంపాడు 22 జూలై (ప్రభ న్యూస్):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల శ్రీరాంపురం ఎస్టి కాలనీ రోడ్డు మార్గం సరిగా లేక గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామస్తులు బాధపడుతూ జీవిస్తున్నారు. రోగం వస్తే అంతే సంగతులు వాహనాలు రాక కావడిలో ప్రయాణం నరకయాతనగా ఉంది.వర్షాకాలం వచ్చిందంటే అధ్వానంగా తయారవుతుంది. మోకాలు లోతు బురదలో వాహనాలు ఏమి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది..

ఆ కాలనీలో హృదయ విదారక ఘటన నేడు చోటుచేసుకుంది. ఒక మహిళకు ఆరోగ్య పరిస్థితి బాగాలేక కావడి పైనే ఒక మూడు కిలోమీటర్లు మోసుకోని రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది .

ఈ విషయం తెలుసుకున్న బూర్గంపాడు ఎస్సై రాజేష్ అక్కడికి చేరుకొని అంబులెన్స్ పిలిపించి మహిళను అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు త్వరగా చికిత్స అందేలా చూశారు.

- Advertisement -

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సారపాక ఎస్టి కాలనీలో గత 30 సంవత్సరాల పైనుంటే తాము ఇక్కడ నివసిస్తున్నామని ఓట్లు అడగడానికి మాత్రమే పార్టీ నాయకులు వస్తారు తప్ప మమ్మల్ని పట్టించుకోరని ఈ గ్రామంలో ఎంతోమంది సమయానికి ఆసుపత్రికి వెళ్లలేక మార్గ మధ్యలోనే చనిపోతున్నారని మాకు రోడ్డు మార్గం వేయాలని ఎస్సై రాజేష్ కి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తూ..ఆ గ్రామస్తులు రోడ్డు వేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement