Sunday, September 8, 2024

TG: నార్సింగిలో బుల్లెట్ కలకలం.. భయంతో జనం పరుగులు..!

హైదరాబాద్ నార్సింగి బైరాగిగూడలో బుల్లెట్ కలకలం సృష్టించింది. ఈ బుల్లెట్ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బైరాగిగూడలోని ఓ అపార్టుమెంట్ లోని 5 అంతస్తులోని కిటికి అద్దాలు ధ్వంసం కావడంతో పాటు ఏకంగా బెడ్ రూమ్ లోకి బుల్లెట్ దూసుకొచ్చింది.

దీంతో అపార్టుమెంట్ వాసులు పరుగులు తీశారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ దూసుకొచ్చినట్టు సమాచారం. భయంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ దూసుకొచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement