Friday, September 20, 2024

BRS – న్యాయం, ధర్మం గెలుస్తుంది – ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ – ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్‌ బంజరాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవితకు పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికాయి

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానన్న కవిత.. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటాననన్నారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామమన్నారు.

ఇంటికి చేరుకున్న కవితకు నివాసంలో తల్లి శోభ, కేటీఆర్‌ సతీమణి శైలిమతో పాటు ఇతర కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు. అలాగే, కుటుంబీకులను ఆలింగనం చేసుకొని.. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించారు. రేపు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకొని కేసీఆర్‌తో భేటీ అవుతారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement