Thursday, September 19, 2024

BRS Party – తెలంగాణ తల్లికి పాలాభిషేకం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు.

మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, శాసనమండలిలో విపక్ష నేత మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

.అక్క‌డే తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం పెట్టాలి..

సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పెట్టింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను ఎకడికక్క‌డ పార్టీ శ్రేణులు సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement