Saturday, September 14, 2024

TG: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ..

శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు కాంగ్రెస్ లో చేరారు.

శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, తదితరులు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే 8 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరికతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్చ ఎనిమిది నుంచి తొమ్మిదికి చేరింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement