Friday, September 6, 2024

TS: భద్రాచలం గోదావరి నదిలో.. బాలుడు మృతి

భద్రాచలం‌ ఐటిడిఏ, జూన్ 22 (ప్రభ న్యూస్) : గోదావరి నదిలో బాలుడు మృతి చెందిన ఘటన ఇవాళ‌ భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… భద్రాచలం పట్టణంలోని గోదావరి నదిలో స్నానం చేసేందుకు నదిలో ఐదుగురు బాలురు దిగారు..

అయితే స్నానంచేసేందుకు నదిలోకి దిగిన చిన్నారులు నదిలో కొట్టుకుపోతుండగా.. గమనించిన స్థానిక గజ ఈతగాళ్లు వెంటనే స్పందించి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కాగా.. ఒక బాలుడు అప్పటికే మృతి చెందాడు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement