Friday, September 6, 2024

Bonalu – ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం స‌మ‌ర్సించిన రేవంత్

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దాంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బోనం స‌మ‌ర్వించుకున్నారు. అమ్మ‌వారికి ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.. అంత‌కు ముందు ఆల‌యానికి చేరుకున్న రేవంత్ కు వేద పండితులు , అధికారులు లాంచ‌నాల‌తో స్వాగ‌తం ప‌లికారు. కాగా, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున మంత్రి పొన్నం అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement