Sunday, September 8, 2024

Yadagiri Gutta – టిఎస్ఆర్టీసీ డిపోలో ర‌క్త‌దాన శిబిరం

యాద‌గిరిగుట్ట – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాదగిరిగుట్ట డిపోలోనేడు మెగా రక్తదాన శిబిరం నిర్వ‌హించారు.. .నేటి ఉదయం డిప్యూటీ రీజనల్ మేనేజర్ శివశంకర్, డిపో మేనేజర్ బి .శ్రీనివాస్ లాంచ‌నంగా ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఉద్యోగులు, డ్రైవర్లు, స్థానిక యువకులు , స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎం.నాగరాజు , యుబిఐ బ్యాంక్ ఉద్యోగులు రక్తదానం చేశారు. మొత్తం 60 మంది రక్త దాన శిబిరం లో పాల్గొని రక్తదానం చేశారు.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు యుబిఐ యాదగిరిగుట్ట శాఖ వారు పండ్లు , జ్యుస్ లను అందజేశారు. అలాగే హైద‌రాబాద్ కు చెందిన‌ అభయ బ్లడ్ సెంటర్ దాత‌ల‌కు సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement