Thursday, September 19, 2024

TG | సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసలు!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కృతజ్ఞతలు చెప్పడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గణేష్ నిమజ్జనోత్సవాల నేపథ్యంలో స్వయంగా పర్యవేక్షించడం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో ఘనంగా జరిగే వినాయక నిమజ్జనాలను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వచ్చి పర్యవేక్షించడం సంతోషించదగ్గ విషయమని రాజాసింగ్ రేవంత్ రెడ్డికి తెలిపారు. బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభ యాత్రలో పాల్గొన్న రాజాసింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేశాయని ప్రశంసించిన రాజాసింగ్.. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఈసారి చాలా బాగా పని చేసిందన్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనోత్సవాలను ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement