Sunday, September 29, 2024

BJP ఎమ్మెల్యే రాజాసింగ్ హత్య కుట్ర భగ్నం

హైదరబాద్లో మరోసారి కలకలం రేగింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను హత్య చేసేందుకు ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది

స్థానికులకు అనుమానం రావడంతో వారిని మంగళా ట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు. ఇద్దరి ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నాయి. దీంతో రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసు లు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement