Thursday, July 4, 2024

TS: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బీజేపీ ఆదిలాబాద్ నేతలు

మంచిర్యాల ప్రతినిధి, జులై 2(ప్రభ న్యూస్) : ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్, పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మర్యాద పూర్వకంగా కలిశారు.

మంచిర్యాల జిల్లాలో ఉన్న సింగరేణి కార్మికుల సంక్షేమం, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై చర్చించారు. వీరితో పాటు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, బీజేపీ సీనియర్ నాయకులు మోట పలుకుల తిరుపతి, పట్టి వెంకట కృష్ణ ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement