Sunday, October 6, 2024

Big Blow – బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ – కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

హైదరాబాద్ ,ఆంధ్రప్రభ బ్యూరో తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపు.బీఆర్ఎస్ ను దెబ్బ. తీసే విధంగా ఆ పార్టీకి చెందిన ఆరుగురు శాసనమండలి సభ్యులు(ఎమ్మెల్సీలు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ,రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో గురువారం బాగా పొద్దు పోయాక కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్ (ఆదిలాబాద్),భాను ప్రసాదరావు(కరీంనగర్),బుగ్గారపు దయానంద్(రంగా రెడ్డి),ఎగ్గె మల్లేశం(రంగారెడ్డి),బసవరాజు సారయ్య (వరంగల్),ప్రభాకర్ రావు(హైదరాబాద్) లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

శాసనమండలిలో 40 మంది సభ్యులుండగా రెండు ఖాళీలున్నాయి.మిగతా 38 మంది సభ్యుల్లో బీఆర్ఎస్ కు 30 మంది సభ్యులుండగా కాంగ్రెస్ పార్టీ అరుగురున్నారు. ఇందులో జీవన్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ కాగా మహేష్ కుమార్ గౌడ్,బల్మూరి వెంకట్,తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.రంగా రెడ్డి జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మేల్సీ గా గెలిచిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్న కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా అడపా దడపా ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు.తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 12 కు చేరింది. వచ్చే నెలలో శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతుండడం, ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ బిల్లులు తిరస్కరణకు గురి కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ వ్యూహం రచించి వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్సీలను బయటకు లాగాలని నిర్ణయించి ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

బడ్జెట్ ,బిల్లులు తిరస్కరణకు గురైతే పాలనా పరమైన ఇబ్బందులు వస్తాయని ఉహించిన సీఎం రేవంత్ రెడ్డి అవసరమైనంత మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవాలని భావించి పధకం రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది .బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన భాను ప్రసాదరావు,ప్రభాకర్ రావు,బసవరాజు సారయ్య గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పని చేసిన వారే.సారయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా కూడా సేవలందించారు.రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి శంషాబాద్ విమా నాశ్రయం నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు.అప్పటికే దస్ పల్లా హోటల్ లో బస చేసి సీఎం నివాసానికి వచ్చిన ఎమ్మెల్సీలతో సమావేశమైన రేవంత్ వారితో కాసేపు సమాలోచనలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement