Tuesday, September 17, 2024

Bhupalapalli – ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కొలువుదీరిన గణనాథులు

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణనాథుడు కొలువుదీరారు.

ఈ నవరాత్రి ఉత్సవాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ (గణపురం మాజీ జెడ్పిటిసి) దంపతులు పాల్గొని విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి వినయ్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ ఉత్సవాల్లో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడితో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

మన సంస్కృతి, సంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శ ప్రాయంm

మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయని, ప్రజలంతా ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఐక్యమత్యంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు, యూత్ పోలీసులు, ఇతర అన్ని శాఖల అధికారులు సూచించే సలహాలు, సూచనలు తప్పక పాటించాలని అన్నారు.

ఈ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వినాయక స్వామి కరుణ కటాక్షాలతో భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement