Sunday, September 8, 2024

Bhupalapalle – బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ – కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కౌన్సిలర్లు

ప్రబా న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం హైదరాబాదులోని రేవంత్ రెడ్డి నివాసంలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ ఐదుగురు వార్డు కౌన్సిలర్ లతో పాటు టీబీజీకేఎస్ మెంబర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని సింగరేణి గడ్డ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు కురిమిల్ల రజిత – శ్రీనివాస్, చల్లూరి మమత – కమలాకర్, ముంజాల రవి గౌడ్, చల్ల రేణుక – రాములు, తొట్ల సంపత్, టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ మండ సంపత్ గౌడ్ వున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో భూపాలపల్లి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకురనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement