Monday, September 16, 2024

Bandi Comments – వాళ్లు గంగ‌లో క‌ల‌వ‌నీయండి … ప్ర‌జ‌ల‌కేం సంబంధం

బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోం
ఆ ఖ‌ర్మ బీజేపీకి లేనే లేదు
కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నాట‌కాలు
ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేసేందుకే విలీనం అంశం
రైతు రుణ‌మాఫీపై నిల‌దీస్తున్న జ‌నం
బండి సంజయ్ హాట్ కామెంట్స్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ వ్యవహారంపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండని అన్నారు. వాటితో ప్రజలకేం సంబంధం? అన్నారు. ఇదే అంశంపై ఇటీవల విపరీతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌పై, ఆ పార్టీ అగ్ర నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని బండి సంజ‌య్‌ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందన్నారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదన్నారు.

రుణ‌మాఫీ చేయ‌లేని కాంగ్రెస్ స‌ర్కారు..

కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టి బొమ్మలను కాల్చేస్తున్నా పట్టించుకోరా? అని నిలదీశారు. రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ విలీన డ్రామాలను తెరమీదకు తీసుకువస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాల‌ని సంజయ్ ఫైర్ అయ్యారు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో రూ. 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి.. బడ్జెట్‌లో రూ. 26 వేల కోట్లు కేటాయించి.. చివరకు రూ. 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా? అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement