Thursday, October 17, 2024

Bandi – బిఆర్ఎస్, కాంగ్రెస్ ల లొల్లి అందుకోస‌మే ….

కరీంనగర్ : రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల హామీలపై చర్చను మళ్లించడానికే కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ విగ్రహాల లొల్లి ముందుకు తీసుకు వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్‌ ఆరోపించారు. క‌రీంన‌గ‌ర్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్, బిఆర్ఎస్ సవాళ్లకు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులకు సరిగ్గా రుణమాఫీ లేక రైతులు సతమతం అవుతున్నారని.. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ రైతు రుణమాఫీ బోగస్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement