Friday, October 25, 2024

ADB | ఉత్త‌మ ఉద్యోగిగా హ‌రిత రిసార్ట్స్ మేనేజర్ కు అవార్డు

జన్నారం, అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ): నిత్యం డ్యూటీనే నమ్ముకొని విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన మేనేజరుకు గుర్తింపు లభించింది. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల్లో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం హరిత హోటల్స్, రిసార్ట్స్ మేనేజర్ ఎస్.వీరేందర్ కుమార్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు.

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనుపర్చినందుకు గాను హైదరాబాదులోని హరిత రిసార్స్ట్ హెడ్ ఆఫీసులో రాష్ట్ర టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రకాష్ రెడ్డి శుక్రవారం ఎక్సలెన్స్ అవార్డును, ప్రశంసా పత్రాన్ని మేనేజర్ వీరేందర్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు శ్రేయోభిలాషులు, మిత్రులు అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement