Saturday, June 29, 2024

TS: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్

మల్టీ జోన్ -1 ఐజీగా ఉన్న ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్య‌త‌ల‌ను అప్పగించింది. ఇప్పటి దాకా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధికి పరిమితమైన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్టును అప్‌గ్రేడ్ చేసి హెచ్ఎండీఏ ప‌రిధికి విస్త‌రిస్తూ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఈ మేర‌కు సోమ‌వారం జీవో జారీ చేసింది.

ఇప్పటివరకు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు, నాళాల ఆక్రమణలు.. చెరువుల ఆక్రమణలన్నీ సమూలంగా నిర్మూలించే స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ ఇన్‌చార్జిగా రంగ‌నాథ్‌కు ప్ర‌భుత్వం బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఈ విభాగం ముఖ్య‌మంత్రి ఆధీనంలో ఉండ‌నుంది. కాగా, కమాండ్ కంట్రోల్ రూమ్‌ (బంజారా హిల్స్ ) కేంద్రంగా స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఏర్పాటు కానున్న‌ట్టు స‌మాచారం. ఇక‌.. హెచ్ఎండీఏ పరిధిలో కబ్జాల మీద ఉక్కుపాదం మోపే బాధ్య‌త ముఖ్య‌మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఐజీ రంగనాథ్ చేప‌ట్ట‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement