Tuesday, September 17, 2024

Assembly – సీతక్కను అవమానించే తీరు చూస్తే.. చెప్పుతో కొడతారు : సీఎం రేవంత్

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అవమానించారని ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో తెలియ‌డం లేదన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా?.. వాళ్లను నేను సొంత అక్కల్లా భావిస్తున్నా అని తెలిపారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించిన తీరు చూస్తే చెప్పుతో కొడతారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివాసీ బిడ్డ‌ను అవ‌మానిస్తే ఊరుకుందామా?
ఆదివాసీ బిడ్డను అవమానిస్తే ఊరుకుందామా అని సీఎం ప్రశ్నించారు. సునీతా, సబితా ఇంద్రారెడ్డి కోసం నేను కొట్లాడిన అని తెలిపారు. నన్ను నమ్ముకున్నా అక్కలు ఇవాళ మంత్రులుగా ఉన్నారని తెలిపారు. ఒక అక్క నన్ను నడి బజారులో వదిలేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

- Advertisement -

ఇప్ప‌టికీ కోర్టుల్లో తిరుగుతున్నా…
ఎన్నికల కోసం నేను వెళ్తే ఇంకో అక్క నాపై రెండు కేసులు పెట్టిందని, ఆ కేసులతో ఇప్పటికీ నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న మీరు ఏమయ్యారని సునీతా, సబితా ఇంద్రారెడ్డికి హితవు పలికారు. సొంత చెల్లెలు గురించి మాత్రం వారు మాట్లాడరని తెలిపారు. దళితుల పట్ల కేసీఆర్ కు ప్రేమ లేదని.. గతంలో దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్‌ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దళిత స్పీకర్ ముందు కూర్చోలేక కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement