Tuesday, September 17, 2024

Khammam : రోడ్డుప్రమాదంలో.. ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి..

దుమ్ముగూడెం, ఆగస్టు 10 (ప్రభ న్యూస్) : దుమ్ముగూడెం మండల పరిధిలోని కొత్తపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన కుంజ దీపక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న దీపక్ తోటి విద్యార్థులతో కలిసి ఆశ్రమ పాఠశాల వార్డెన్ కు కానీ, హెచ్ఎం కు కానీ సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లారు.

ఆశ్రమ పాఠశాల వద్ద నుంచి ఆటో ఎక్కి ఇంటికి భద్రాచలం వైపు వెళ్తుండగా తునికిచెరువు వద్దకు వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న కారు విద్యార్థులున్న ఆటోను బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో దీపక్ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement