Monday, July 1, 2024

Delhi: లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం..

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జూన్ 24న సోమవారం కొందరు ఎంపీలు లోక్‌సభలో ప్రమాణం చేశారు. ఇవాళ సైతం ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం దుమారం రేపింది. అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణంపై లోక్ సభలో రగడ…
లోక్ సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై పాలస్తీనా అనడంపై లోక్ సభలో రగడ చోటుచేసుకుంది. దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన ప్రమాణం చేశాక పార్లమెంట్ వెలుపల మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. జై పాలస్తీనా అనడం తప్పు కాదా ? అని ప్రశ్నించారు.

అసదుద్దీన్ స్పందిస్తూ… తాను చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. జై పాలస్తీనా అంటే ఇబ్బంది ఏమిటని నిలదీశారు. అభ్యంతరం చెప్పేవాళ్ల గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహాత్మా గాంధీ కూడా పాలస్తీనా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని సూచించారు. నేను చెప్పాల్సింది చెప్పానని వ్యాఖ్యానించారు.

- Advertisement -

అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ వెల్లడించారు. ప్రమాణం చేసిన తర్వాత చివరలో, జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement