Friday, October 18, 2024

Appeal – ఆర్ ఆర్ ఆర్ రోడ్డు ప‌నులు వేగ‌వంతం చేయండి… మంత్రి కోమ‌టిరెడ్డి

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ను కోరారు మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి. అలాగే నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఎఫ్సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని అభ్య‌ర్ధించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న కోమ‌టిరెడ్డి నేడు ఆయ‌న ను క‌ల‌సి ఒక విన‌తి ప‌త్రం అంద‌జేశారు.. తెలంగాణ రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఆర్&బీ స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు. రహదారుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెక్రటరీతో కులంకుషంగా చర్చించారు. నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్ఎఫ్సీ ఏర్పాటు చేస్తామని అనురాగ్ జైన్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement