Sunday, June 30, 2024

TS : మ‌రో వారం రోజుల పాటు వ‌ర్షాలు

ఇవాళ్టి నుంచి మరో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు వర్షాలు పడనుండటంతో రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇవాళ నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

- Advertisement -

అలాగే ఆయా ప్రాంతాల్లో వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరి అంచనాలు నిజమైతే.. ఎన్నికల నిర్వహణ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నెల 13న రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరగనుంది. ఆ రోజు వర్షం పడితే పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వర్షం కురిసిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement