Saturday, July 6, 2024

TG: ఏఈఈ (సివిల్) ఉద్యోగుల జాబితా ప్ర‌క‌టించండి… టీజీపీఎస్సీ చైర్మన్ తో కేటీఆర్

ఇటీవ‌ల కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు
దీనిపై టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి కేటీఆర్ ఫోన్ కాల్
22 నెల‌లైనా ఫైన‌ల్ లిస్ట్ విడుద‌ల చేయ‌రా అంటూ ప్ర‌శ్న‌
త‌క్ష‌ణం వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఇవాళ నందినగర్ లోని కేటీఆర్ ఇంట్లో కలిశారు.ఈ జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు..

దాదాపు 22నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని ఆయ‌న‌కు తెలిపారు. అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందని గుర్తు చేశారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఈ తుది జాబితాను విడుదల చేయటం లేదని, దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని ఛైర్మ‌న్ దృష్టికి తెచ్చారు. వెంటనే టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇక త‌న‌ను క‌ల‌సిన అభ్య‌ర్ధుల‌తో కేటీఆర్ మాట్లాడుతూ.. తప్పకుండా అండ‌గా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement