Thursday, October 17, 2024

TG: ఇక బీఆర్ఎస్ రణం.. 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనల పోరు..

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రైతు రుణామాఫీలపై నిరసనలకు పిలుపునిచ్చింది. రైతులందరికీ రుణమాఫీలు కాలేదంటూ ముందు నుండి విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ ఈనెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.

ఎన్నికల మేనిఫెస్టోలో రూ.40 వేల కోట్ల రుణమాఫీలని, ఇపుడు కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే రుణమాఫీలు చేసారంటూ విమర్శించారు. 40% మంది రైతులకు కూడా రుణమాఫీలు చేయకముందే రుణమాఫీ సక్సెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ.. అందుకే ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నామని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement