Wednesday, October 16, 2024

TS: బండి సంజయ్ కు అపూర్వ స్వాగతం

కరీంనగర్ కు చేరుకున్న కేంద్ర హోం సహాయ మంత్రి
బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ అడుగు పెట్టారు. బీజేపీ కార్యకర్తలు బాణ‌సంచాలు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు. శనిగరం చేరుకున్న బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు త‌ర‌లిరావ‌డంతో వాహన రాకపోకలు స్తంభించాయి. జైజై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. వినూత్న రీతిలో బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

మీడియా వాహనం ఎక్కి బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు బండి సంజయ్ అభివాదం చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వందలాది వాహనాలతో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కరీంనగర్ కు చేరుకోనున్న బండి సంజయ్ కు కరీంనగర్ బైపాస్ సమీపంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement