Monday, July 1, 2024

TS: గట్టు సింగారం గుట్టపై గుర్తుతెలియని వ్యక్తి మృతి..

అస్థిపంజరంను గుర్తించిన పోలీసులు
పెద్దపల్లి రూరల్, జూన్ 29 (ప్రభ న్యూస్): పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ పంచాయితీ గట్టు సింగారం గుట్టపై గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గొర్ల కాపరులు గుట్టపై మృతదేహం అస్థిపంజరం గుర్తించి పంచాయితీ కార్యదర్శికి సమాచారం అందించారు.

పంచాయితీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు బసంత్ నగర్ ఎస్ఐ ఆర్.స్వామి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించి మనిషి అస్థి పంజరం గుర్తించారు. మృతుని వయస్సు 25 నుండి 40 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలంలో వైద్యులచే అస్థిపంజరంకు పంచనామా నిర్వహించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వామి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement