Friday, September 6, 2024

TS : వికారాబాద్‌, వ‌న‌ప‌ర్తిల‌లో అమిత్‌షా ఎన్నిక‌ల ప్ర‌చారం

తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇవాళ్టితో ప్ర‌చారం ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అగ్ర‌నేత‌లు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇవాళ మ‌రోసారి అమిత్‌షా ఎన్నిక‌ల ప్ర‌చారం నిమిత్తం రానున్నారు. ఉద‌యం వికారాబాద్‌, వ‌న‌ప‌ర్తిల‌లో నిర్వ‌హించే స‌భ‌లో ఆయ‌న పాల్గొంటారు.

- Advertisement -

కాగా ఎన్నిక‌ల ప్ర‌చారానికి నేటితో స‌మ‌యం ముగుస్తుంది. ఈనెల 13న ఓటింగ్ జ‌రగ‌నుంది. ఈ క్ర‌మంలో నేడు కేంద్ర‌హోం శాఖ మంత్రి అమిత్‌షా బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్థులకు మ‌ద్ధ‌తుగా ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. వికారాబాద్‌, వ‌న‌ప‌ర్తిలో బీజేపీ అభ్య‌ర్థుల త‌రుపున ఓట్ల‌ను అభ్య‌ర్థించ‌నున్నారు. అనంత‌రం అమిత్‌షా మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement