Friday, September 6, 2024

All Safe – మంత్రి పొంగులేటి నిరంతర పర్యవేక్షణతో పెద్దవాగు నుంచి సురక్షితంగా బయటపడ్డ కూలీలు

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – భద్రాద్రి-కొత్తగూడెం – భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పెద్దవాగు లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్వయంగా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రంగ లోకి దిగారు. విషయం తెలిసిన వెంటనే ఆయన హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు స్వయంగా ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

పెద్దవాగు సంఘటన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కు దగ్గరలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో మంత్రి స్వయంగా మాట్లాడారు. మంత్రి విజ్ఞప్తి మేరకు, ఆ వాగులో చిక్కుకున్న 30 మంది కూలీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసి వారిని రక్షించింది.

- Advertisement -

సహాయక చర్యలలో పాల్గొని ప్రజల ప్రాణాలను కాపాడినందుకు గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు..మిగిలిన మరో అయిదుగురిని బయటికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీస్కోవాలని కూడా అధికారులకు సూచించారు.అందరు

పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ను ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చూడాలని అధికారులను కోరారు• మొత్తం పరిస్థితిని మంత్రి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో దిగువ భాగం, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టామని పొంగులేటి తెలిపారు. నీటిపారుదల శాఖ, ఇతర అధికారులు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నారాయణపురం, ప్రమాదం తలెత్తే లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement