Thursday, October 3, 2024

TG | ఎస్సై మరణ వార్త విని… గుండెపోటుతో మేనత్త మృతి

ఆత్మహత్యకు యత్నించిన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. జూన్ 30న శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి వార్తతో శోకసంద్రంలో మునిగిపోయిన వారి కుటుంబంలో మరో విషాదం అలుముకుంది. ఎస్సై శ్రీనివాస్ మరణవార్త విని అతని మేనత్త రాజమ్మ గుండెపోటుతో మృతి కన్నుమూశారు.

నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన మేనత్త రాజమ్మ శ్రీనివాస్ మృతి వార్త తెలియగానే కుప్పకూలిపోయింది. ఇంట్లోనే గుండెపోటుతో కన్నుమూసింది. ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement