Tuesday, October 8, 2024

ABD | రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు..

జన్నారం,(ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మర్రిగూడ గ్రామ సమీపంలోని శ్రీ రాఘవేంద్ర రైస్ మిల్లులో బుధవారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ రైస్‌మిల్లులో బియ్యం, వడ్ల బస్తాల స్టాక్‌ రిజిస్టర్‌, ఓఎంఆర్‌ సరఫరాను పరిశీలించారు. ఆయన వెంట పెద్ద‌పెల్లి సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, మంచిర్యాల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ వరదరాజులు, విజిలెన్స్ అధికారులు, స్థానిక తహసీల్దార్ సి.రాజమనోహర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్, ఎస్సై గుండేటి రాజవర్ధన్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement