Friday, October 18, 2024

ADB: తలమడుగులో ఘనంగా వటసావిత్రి వ్రత పూజలు…

తలమడుగు (ప్రభ న్యూస్) : మండలంలోని మహిళలు వటసావిత్రి పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో వటజావిత్రి పూర్ణిమ‌ సందర్భంగా వేద పండితులు నేరెళ్ల కళ్యాణచారి ఆధ్వర్యంలో పూజలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు ఆలయంలోని మర్రి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ వారు అన్ని వసతులు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముద్ధం ఇంద్రసేనా రెడ్డి, గౌరవ అధ్యక్షులు కళ్లెం తిరుపతి రెడ్డి, సతీష్, రామ్ రెడ్డి, స్వామి యాదవ్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement