Sunday, September 15, 2024

ADB: ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. వివాహిత ఆత్మహత్య..

జైనూర్, ఆగస్టు 26(ప్రభన్యూస్) : అర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జైనూర్ ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్ మండల కేంద్రంలోని వీకర్ సెక్షన్ కు చెందిన పల్లపు లక్ష్మీ (41) కి నలుగురు పిల్లలు. ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. గతకొంత కాలంగా వీరి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.

2020 సంవత్సరంలో కూతురు పెళ్లికి తీసుకున్న అప్పును ఎలా తీర్చాలో అని బాధపడుతూ ఉండేదని, దీంతో ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గమనించి జైనూర్ పోలీసులకు సమాచారం అందించారని, దీంతో ఎస్సై సాగర్ వడ్డెర సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు రాపెన్ రమేష్, సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై సాగర్ తెలిపారు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాగర్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement