Friday, September 6, 2024

ADB: ట్రాక్టర్, కారు ఢీ.. ఇద్దరికి గాయాలు

ప్రమాదాలకు నేలవుగా కన్నాల యూటర్న్
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసమే ఈ యూటర్న్
ప్రజల ప్రాణాలను బలికొంటున్న యూటర్న్ పై నామమాత్రపు విచారణలు

బెల్లంపల్లి, జులై 23 (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల శివారులోని జాతీయ రహదారి యూటర్న్ వద్ద మంగళవారం ట్రాక్టర్, కారు ఢీకొనడంతో ఇద్దరు భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం… కాగజ్ నగర్ కు చెందిన గొల్లపూడి రవికుమార్, అనూష జ్యోతిలు కారులో వెళ్తుండగా కన్నాల యూటర్న్ వద్ద ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.

వారిని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి రూరల్ సీఐ అప్సలుద్దీన్, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ రమేష్, తాళ్ల గురుజాల ఎస్సై నరేష్ కు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -

ప్రమాదాలకు నెలవుగా యూటర్న్.
ప్రాణాలు బలికొంటున్న యూటర్న్ పై నామమాత్రపు విచారణలు…
బెల్లంపల్లి మండలం కన్నాల హైవే పై ఉన్న యూటర్న్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం, గతంలో ఎంతోమంది కాళ్లు, చేతులు విరిగి ఇంకా హాస్పిటల్ లోనే ఎంతోమంది ఉన్నారు. నేషనల్ హైవే ని ఆనుకొని ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ కోసం అప్పటి ఒక ప్రజా ప్రతినిధి సహకారంతో వెంచర్ కోసం ఏర్పాటు చేసిన ఈ యూటర్న్ ఎంతోమంది ప్రాణాలను బలికొంటుంది. ఈ యూటర్న్ ను తీసివేయాలని అనేకమంది కలెక్టర్ కు, ఆర్డీవోకు, త‌హ‌సీల్దార్ కు, జాతీయ రహదారి అధికారులకు వినతులు చేసినా అధికారులు మాత్రం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మద్దతు పలుకుతూ అడపాదడపా విచారణ చేసినట్లు చూపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ యూటర్న్ ను వెంటనే తీసివేయాలని అనేక మంది కోరడమే కాకుండా కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement