Monday, September 16, 2024

ADB: ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు బీజేపీలో చేరిక‌…

ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ : మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆదిలాబాద్‌లో బీఆర్ ఎస్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. బీఆర్ ఎస్‌కు చెందిన‌ ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని వదిలి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారికి బీజేపీ కండువాలు వేసి ఎమ్మెల్యే సాద‌రంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే పాయల శంకర్ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరిన‌ట్లు కౌన్సిలర్లు తెలిపారు. కాగా ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్లో ముగ్గురు చేరికతో బీజేపీ బలం 14 కు చేరుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement