Friday, September 20, 2024

ADB | పలు చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్ !

జన్నారం, (ప్రభ న్యూస్) : ఉమ్మడి జిల్లాలో చోరీలకు పాల్పడిన దొంగను జన్నారం పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని పొనకల్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్ షాపు యజమాని రాజ్ పురోహిత్ రామ్ సింగ్ ఇంట్లో ఈ నెల 8న చొర‌బ‌డి 4 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన నిర్మల్ వాసి శంకర్ రామ్‌దేవాసిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరినట్లు లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్ తెలిపారు.

నిందితులు గతంలోనూ పలు దొంగతనాలకు పాల్పడ్డారని సీఐ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్‌లో ఓ వ్యక్తి ఇంట్లో 3 తులాల బంగారు ముద్దను దొంగిలించాడని, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్, ఇచ్చోడలలో పలు చోరీలకు పాల్పడ్డారని వెల్లడించారు.

జన్నారం ఎస్‌ఎస్‌ రాజవర్ధన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుళ్లు తుకారాం, కొత్తూరు భాస్కర్‌ తదితర పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్‌ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement