Thursday, October 17, 2024

ADB: వైన్స్ లో చోరీ… 4 లక్షల విలువ మద్యం, 15వేల నగదు మాయం

జైనూర్, జులై 22 (ప్రభ న్యూస్) : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని రాగాపూర్ పిట్టగూడ ఎక్స్ రోడ్ లోని శ్రీ సాయి వైన్స్ లో గుర్తుతెలియని దొంగలు సోమవారం తెల్లవారుజామున వైన్స్ సెటర్లు పగలగొట్టి అందులో ఉన్న 4 లక్షల విలువ చేసే మద్యం 15 వేల నగదును చోరీ జరిగినట్లు వైన్స్ నిర్వాహకులు జాదవ్ ధరమ్ సింగ్ తెలిపారు.

ఈ చోరీ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఇవాళ ఉదయం జైనూర్ సీఐ అంజయ్య, సిర్పూర్ (యు) ఏఎస్ఐ వచ్చి పరిశీలించినట్లు నిర్వాహకులు తెలిపారు. డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీం తో తనిఖీలు చేయిస్తామని సీఐ అంజయ్య తెలిపినట్లు వైన్స్ నిర్వాహకులు జాదవ్ ధరమ్ సింగ్ తెలిపారు. వైన్స్ లో చోరీ జరగడం ఇదే మొదటిసారి.వైన్స్ లో దొంగతనం పై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ సాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement