Saturday, September 7, 2024

ADB: కన్నుల పండువ గా సుబ్రహ్మణ్యస్వామి శోభాయాత్ర

బోథ్, జనవరి 6(ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని కన్నుల పండువగ అయ్యప్ప స్వామి భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా భాజా భజంత్రీలతో మంగళహారలతో, అయ్యప్ప స్వామి సంకీర్తనలతో ఆనందంగా నృత్యాలు చేశారు.

పట్టణమంతా అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగిపోయింది. అనంతరం స్థానిక మార్కండేయ మందిరంలో అయ్యప్ప స్వాములు పడిపూజ నిర్వహించారు. తదనంతరం గురు స్వామి కిషోర్ ఆధ్వర్యంలో అన్నదానాన్ని స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement