Friday, October 18, 2024

ADB | మామ చేతిలో అల్లుడి హతం..

కన్నెపెల్లి, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో మంగళవారం సాయంత్రం అల్లుడిని మామ హతమార్చిన ఘటన కలకలం రేపింది. మండలంలోని సాలిగాం గ్రామంలో కొమాస నరేందర్ (37)పై అతని మామ గోలేటి శంకర్ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు.

గతంలో అల్లుడు నరేందర్.. త‌న‌ అత్త, మామలపై తుపాకీతో దాడి చేయడం జరిగింది. అప్పటి నుంచి కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement