Thursday, September 12, 2024

ADB: శాంతించు గోదారమ్మ… అర్చకుల ప్ర‌త్యేక పూజ‌లు

బాసర, ఆగస్టు 3 (ప్రభ న్యూస్) : శాంతించు గోదారమ్మ అంటూ మంగళవారం బాసర పుణ్యక్షేత్రం వద్ద ఆలయ అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నది ఉగ్రరూపంగా ప్రవహిస్తుంది.

ప్రాణం నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ఉదయం ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ పూజారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద పండితులు వేదమంత్రోచ్ఛరణలతో మంగళ‌వాయిద్యాలతో శాంతి పూజను నిర్వహించి గోదారమ్మకు సారె ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయరామరవు, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement