Saturday, September 21, 2024

TG | టైగర్ జోన్‌లో రెండు ఆంక్షలు ఎత్తివేయాలని నిరసన…

జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలో రెండు ప్రధాన ఆంక్షలు ఎత్తివేయాలని మండల సమైక్య పోరాట సమితి నాయకులు శ్రీరాముల భూమాచారి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే పర్యటన దృష్ట్యా ధర్మారం చౌరస్తాలో టైగర్ జోన్‌లో రెండు ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మధ్యలో బైఠాయించి నిరసన తెలిపారు.

అభయారణ్యంలోని లక్షెటిపేట మీదుగా జన్నారం, ఉట్నూర్, దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్ మండలాలకు భారీ వాహనాలను ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతించాలని, వాహనాలకు వసూలు చేస్తున్న రుసుమును రద్దు చేయాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ ఎస్ రాజవర్ధన్ అక్కడికి చేరుకుని భూమాచారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement