Friday, September 20, 2024

ADB: 108లో గర్భిణి మహిళా ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం..

సిర్పూర్ (యు), ఆగస్టు 23 (ప్రభ న్యూస్) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని జాముల్దార గ్రామానికి చెందిన కినక పార్వతి గర్భిణి మహిళలకు పురిటి నొప్పులు రావడంతో ప్రసూతి కోసం 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్ లో ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చిందని 108 రామేశ్వరి పైలట్ అడ దయాకర్ తెలిపారు.

మెరుగైన చిరుతల కోసం ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. 108లో గర్భిణీ మహిళకు ఎలాంటి హాని జరగకుండా ప్రసూతి చేసిన ఈఏంటీ రామేశ్వరికి మహిళ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement