Friday, October 18, 2024

ADB | ఎంబీబీఎస్ సీట్ సాధించిన పొనకల్ వాసి

జన్నారం, ( ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేదరివాడకు చెందిన గొల్లపల్లి శ్రీ వైష్ణవి ఎంబీబీఎస్ లో సీటు సాధించింది. పొనకల్ కు చెందిన గొల్లపెల్లి సుభాష్ గౌడ్, వాణి దంపతుల కుమార్తె శ్రీ వైష్ణవి చదువులో మొదటి నుంచి ఎంతో చురుగ్గా చదువుకొని మంచి మార్కులు సాధిస్తూ వస్తుంది.

ఆమె మండల కేంద్రంలోని స్లేట్ హైస్కూల్లో ఒకటి నుంచి 7వ తరగతి వరకు, హైదరాబాదులో 8 నుంచి 10వ తరగతి వరకు, మండల కేంద్రంలోని కరిమల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆతర్వాత మెడిసిన్ లాంగ్ టర్మ్ తీసుకొని, నీట్ రాసి రాష్ట్రస్థాయిలో మంచి మార్కులతో 4258 ర్యాంకు సాధించింది. దీంతో రాష్ట్రంలోని నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ కేటాయించగా, ఈ మేరకు ఆమె అడ్మిషన్ పొందింది. ఈ సందర్భంగా ఆమెను తండ్రి మిత్రులు, బంధువులు,గౌడ సంఘం నేతలు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement