Friday, September 6, 2024

ADB: అర్ధరాత్రి గ్రామీణ బ్యాంకులో అలజడి..

టెక్నీకల్ సమస్య తో నిర్దారించిన బ్యాంకు సిబ్బంది, పోలీసులు
పెంచికల్పేట్, జూన్ 22(ప్రభ న్యూస్) : మండల కేంద్రంలోని స్థానిక ఎల్కపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శఅర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో స్థానిక గ్రామీణ బ్యాంకులో ఎమర్జెన్సీ సైరన్ మోగడంతో స్థానిక కాలనీవాసులు 100నెంబర్ కు డయల్ చేసి తెలపడంతో హుటాహుటిన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు.

వెంటనే సంబంధిత మేనేజర్ కు ఫోన్ చేసి బ్యాంకు వద్దకు సిబ్బందిని పిలిపించి బ్యాంకును ఓపెన్ చేసి రాబరీ ఏమైనా జరుగుతుందా.. ఎవరైనా లోపల ఉన్నారా అంటూ ప్రశ్నించి మొత్తం వెతికి చూశారు. స్ట్రాంగ్ రూమ్ ను కూడా పూర్తిగా చెక్ చేశారు. ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి సైరన్ ఎలా మోగింది.. ఎందుకు మోగింది.. పోలీసులు ఎందుకు వచ్చారు.. అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోగా.. ఎస్సై కొమురయ్య, బ్యాంకు సిబ్బంది తనిఖీ చేయగా టెక్నీకల్ సమస్యతో సైరన్ మొగినట్లు ఎస్సై శనివారం తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement