Friday, September 20, 2024

ADB: రూ.70.12 లక్షల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

జన్నారం, ఆగస్టు 8(ప్రభ న్యూస్): రూ.70 లక్షల 12వేల 676ల చెక్కులను103 లబ్ధిదారులకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశం హాల్లో గురువారం 61 మంది ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, 42 మంది ఆసుపత్రిలో చికిత్స పొందిన లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ సి.రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీఓ ఠాగూర్ శశికళ, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్ అలీఖాన్, మేకల మాణిక్యం, సీనియర్ నేతలు మిక్కిలినేని రాజశేఖర్, గుర్రం మోహన్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, సయ్యద్ ఫసిఉల్లా, డి.లక్ష్మీనారాయణ, దాముక కరుణాకర్, ముత్యం సతీష్, కంప సుందర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement